Sunday, May 5, 2024

కేటీఆర్ కి నోటీసులా.. కోమటిరెడ్డిని అనే దమ్ములేదా మాణిక్కం ఠాగూర్..!

spot_img

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి మాణిక్కం ఠాగూర్ వ్యవహారంపై మండిపడ్డాడు. కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఉంది మాణిక్కం ఠాగూర్ తీరు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు పీసీసీ పదవి కొనుక్కున్నారు అని స్వయంగా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఒక్కసారి కాదు.. అనేకసార్లు ఆరోపించారు. వాళ్లను ఏమీ చేయలేకపోయిన మాణిక్కం ఠాగూర్.. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు పంపిస్తున్నారు. పీసీసీ పదవి అమ్ముకున్నది నిజం కాకుంటే ఆనాడే ఎందుకు నోటీసులు పంపలేదు.? మొదట ఆరోపణలు చేసిన మీ పార్టీ నాయకుల మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. వారిని ఏమీ చేయలేక, చేతగాక అన్నీ మూసుకుని ఇన్నాళ్లు కూర్చున్నావు. నిన్ను తిట్టి ఆరోపణలు చేసిన వ్యక్తే ఇప్పుడు కేబినెట్ లో మంత్రి అయ్యాడు.

అయినా నీ పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేని నువ్వు.. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా నాయకులకు నోటీసులు పంపిస్తున్నావు. పరువుతీసింది నీ పార్టీ వాళ్లే. వాళ్లను పల్లెత్తుమాట అనేధైర్యం నీకు లేదు. కానీ బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇచ్చి పెద్ద తురుంఖాన్ మాదిరిగా ఫోజులు కొడుతున్నావ్. ఇదంతా మీ పార్టీ తెలంగాణలో ఇచ్చిన ఎన్నికల హామీల నుంచి దృష్టి మరల్చే వ్యవహారం అని చిన్నపిల్లాడికి కూడా అర్థం అయ్యింది. ఇకనైనా చిల్లర పనులు మాని కాస్త బుద్ధిగా పనిచేయండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అయినా.. మీ నోటీసులకు, ఉడుత ఊపులకు బయపడేటోళ్లం కాదు తెలంగాణ బిడ్డలం. నీకంటే జేజమ్మలాంటి లీడర్లకే చుక్కలు చూపెట్టి.. తెలంగాణ తెచ్చుకున్నోళ్లం. నీ చిల్లర పబ్లిసిటీ కోసం వేస్తున్న కేసులకు, ఇస్తున్న నోటీసులకు భయపడతాం అనుకుంటున్నావా.? వెళ్లి ఇండియా కూటమిలో అందరు వదిలేసి ఒంటరై చెట్టూ పుట్టా పట్టుకుని తిరుగుతున్న నీ రాహుల్ గాంధీని ఓదార్చుకో’ అని అన్నారు సతీష్ రెడ్డి.

Latest News

More Articles