ముంబై: వాస్తు దోషాలు తొలగింపు సాకుతో ఐదుగురు వ్యక్తులు ఒక మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 35 ఏండ్ల మహిళ భర్తకు దుష్టశక్తులు ఆవహించాయని, వారున్న ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని అతడి ఐదుగురు స్నేహితులు ఆమెను నమ్మించారు.
Also Read.. టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సినీ నటుడు వెంకటేశ్
ఆమె భర్తకు ఎలాంటి హాని జరుగకుండా ఉండేందుకు ఇంట్లో శాంతి కోసం పలు పూజలు చేయాలని నమ్మించారు. 2018 ఏప్రిల్ నుంచి ఆ మహిళ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఇంటికి వెళ్లి పూజలు చేసి ‘పంచామృతం’ పేరుతో మత్తు మందు కలిపిన పానీయాన్ని తాగించేవారు. ఆ మహిళ మత్తులో ఉండగా అత్యాచారానికి పాల్పడేవారు.
Also Read.. మహారాష్ట్రలో లోయలో పడ్డ కారు: నలుగురు తెలంగాణ వాసులు మృతి
అలాగే పూజల కోసమంటూ రూ.2.1 లక్షల డబ్బుతోపాటు బంగారాన్ని ఆమె నుంచి తీసుకున్నారు. ఎట్టకేలకు మహిళ ధైర్యం చేసి సెప్టెంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రవీంద్ర భాటే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్, గణేష్ కదమ్లను పోలీసులు అరెస్టు చేశారు.