Vinod Kumar said that Rajanna Sircilla district has developed significantly in all fields
Vinod Kumar,Rajanna Sircilla district,developed, significantly, all fields
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణలను నిలిపామని చెప్పారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు.సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ అధ్వర్యంలో ఇవాళ(ఆదివారం) నిర్వహించిన జాతీయ సమైక్యత వేడుకలకు వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఐడీఓసీ కాన్ఫరెన్స్ హల్ లో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణేష్ ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. ఆ తర్వత మాట్లాడిన ఆయన.. అన్ని ఆలోచించే హైదరాబాద్ సంస్థానం విలీనం ను జాతీయ సమైక్యత దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. రాచరిక పాలన నుండి విముక్తి పొందిన ప్రజాస్వామ్య పాలన ఆవిర్భవించిన 17, సెప్టెంబర్ 1948ని భిన్న ఆలోచన విధానం తో కొందరూ విమోచన, విలీన, విద్రోహ దినంగా పిలుచుకుంటున్నారని అన్నారు. తాము మాత్రం అన్ని ఆలోచించే తెలంగాణ భారత దేశంలో భాగం కాబడిన సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినంగా ప్రకటించి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు వినోద్ కుమార్.