Wednesday, May 8, 2024

ఆ పార్టీలకు ఓటేసి ఓటును వృధా చేసుకోకండి

spot_img

సిద్దిపేట జిల్లా: పదేళ్ల కేసీఆర్ హయాంలో ఘోరంగా ఉన్న గజ్వెల్ గొప్పగామారింది. ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేని గజ్వెల్ ను  ఇతర ప్రాంతాలకు నీళ్లు పంపే గజ్వేల్ గా మార్చాడని మంత్రి హరీష్ రావు అన్నారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయార్ లను కట్టి.. గోదావరి జాలాలతో చెరువుల్ని వాగుల్ని నిండు ఎండా కాలంలో నింపి కరువును శాశ్వతంగా దూరం చేసిండు కేసీఆర్ అని కొనియాడారు. గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం కేసీఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచార రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఇక్కడినుండి గతంలో సజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి.. ప్రాతినిధ్యం వహించారు.. ఏమైనా అభివృద్ధి జరిగిందా..? గతం లో పందులు తిరిగిన గజ్వెల్ ఆసుపత్రిని గొప్పగామార్చాడు కేసీఆర్. ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి. కరెంటు, సాగునీరు కడుపునిండా ఇచ్చిన నేత. దొంగరాత్రి కరెంటుతో రైతులు పొలాలకాడ నిద్ర పోయే పరిస్థితి.. పాములు కుట్టి రైతులు చనిపోయిన పరిస్థితి ఉండే అన్నారు.

కాంగ్రెసోడు, బీజేపీ లు గెలిస్తే కేసీఆర్ కట్టిన బిల్డింగ్ లకు కనీసం రంగులు కూడావేయలేరు. ఎన్నో ఏండ్ల కలను నిజం చేసి గజ్వెల్ కు రైలు తెచ్చిండు. గజ్వేల్ కు గోదావరి జాలాలు తెచ్చిండు. కరోనా వస్తే తాను వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాము.. ప్రజలను ఆదుకున్నాము. మన కష్టం తీర్చినవారిని గుర్తుంచు కోవాలి. పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ముసలోళ్లకు ఆసరా పెన్షన్ ఇచ్చాడు. బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మి కింద ప్రతినెలా 3000 ఇస్తాం. 4 వందలకే గ్యాస్ సిలండర్ ఇస్తాం. గ్యాస్ సిలండర్ ధరను పెంచిన బీజేపీ వాడు ఏ మొఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తున్నాడు. ధరలు పెంచిన బీజేపీ వాళ్ళను ఊర్లకు ఓట్ల కోసం వస్తే చీపురుతో కొట్టాలని పిలుపునిచ్చారు.

రైతు బంధు ఎకరానికి 16000 ఇస్తాం. కాంగ్రెస్ దొంగమాటలు జెప్పుతోంది. రైతులకు కడుపు నిండా 24 గంటల కరెంటు ఇస్తున్నం. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే వస్తుంది.  ప్రతింటికీ కేసీఆర్ బీమా కింద 5 లక్షల రూపాయలు ఇస్తాము. కేసీఆర్ వచ్చాక భూముల విలువ పెరిగింది.  SC, ST, BC లకు ఇచ్చిన అసైండు భూములకు పట్టాలు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డుడారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ఇంకా ఏ సమస్య ఉన్నా పరిష్కారము చేసుకుందాం. బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు.. ఆ పార్టీ కి ఓటేసి ఓటును వృధా చేసుకోకండి. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మితే మోసపోతామన్నారు.

Latest News

More Articles