Monday, May 6, 2024

కాంగ్రెసోళ్లు లీడర్లను కొనొచ్చు..కానీ ప్రజలను కొనలేరు

spot_img

ఆపదలో ఆదుకున్న, తలలో నాలుకలా ఉండే దయాకర్ రావు గెలవాలా? ఓట్ల ముందట నోట్ల కట్టలు పట్టుకొచ్చిన అమెరికా ఎన్నారైలు గెలవాలా? అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. పాలకుర్తిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు మంత్రి హరీశ్ రావు. కరోనా సమయంలో దయన్న పోరాడిండు. నాతో కొట్లాడి స్పెషల్ కోటాలో మందులు తెచ్చుకుని ప్రజలను కాపాడుకున్నడు. ప్రతీ గల్లీకి సీసీ రోడ్లు, ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిండు దయాకర్ రావు. ఆపోజిట్ అభ్యర్ధి అమెరికాలో విల్లాలు గిఫ్ట్ గా ఇచ్చి టిక్కెట్లు కొన్నారని కాంగ్రెసోళ్లే అంటున్నరు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ స్పూర్తి నిండిన పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరన్నారు.

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లు, అరాచక పాలన

డబ్బులున్నయని కాంగ్రెసోళ్లకు అహంకారం. దాంతో లీడర్లను కొంటారు.. కానీ ప్రజలను కొనలేరన్నారు మంత్రి హరీశ్ రావు. దయన్న గెలుపును నోట్ల కట్టలు అడ్డుకోలేవన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అని చెప్పి ఉన్నగోసి ఊడపీకిర్రు. నమ్మితే మోసపోతం, పాపమంటే గోస పడ్తం. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాల్నా? కరెంట్ కావాలంటే దయన్నకు ఓటు వేయాలన్నారు. కాంగ్రెసోళ్లు ప్రతీ రైతుకు 15వేలు అంటున్నరు. కేసీఆర్ మాత్రం ఎకరాకు 16 వేలు ఇస్తడు. 12 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్ గెలవాల్నా? 12 మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ గెలవాల్నా? అని అన్నారు. ఓడినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు, గెలిచినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు. ఇలాంటి కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి రిస్క్ తీసుకుందామా?. గతంలో తండాలకు కరెంటు లేదు, నీళ్లు రావు, రోడ్డు లేకుండే. కానీ దయాకరన్న గెలిచిన తర్వాత డాంబర్ రోడ్డు, ఇంటింటికీ నీళ్లు, 24గంటల కరెంట్ వచ్చింది. ముఖ్యంగా తండాలు గ్రామపంచాయితీలు అయ్యియని తెలిపారు మంత్రి హరీశ్ రావు.

ఈ సారి దయాకర్ అన్నను గెలిపిస్తే అందరికీ గిరిజన బంధు అమలు చేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. దయాకర్ అన్న మంచి మనిషి. గుణమున్న వ్యక్తి. ఆపద వచ్చినప్పుడు సాయం చేసే మనిషి. దయన్నని గెలిపించి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. పాలకుర్తి పవర్ ఫుల్ గా ఉండాలంటే దయన్నని గెలిపించాలన్నారు.

పాలకుర్తి అభివృద్దే నా లక్ష్యమని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి ప్రజలు,నా కార్యకర్తలను కంటికి రెప్పలా కపడుకుంటా. కరోనా కష్ట కాలంలో పాలకుర్తి ప్రజలను ఆదుకున్నది మీ దయన్న. ప్రతీ గ్రామంలో వంద ఇండ్లు మంజూరు చేసి కట్టి ఇవ్వడమే నా లక్ష్యం. మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చాను. పాలకుర్తి నియోజకవర్గనికి పది వేల ఇండ్లను సీఎం కేసీఆర్ తో మంజూరు చేయించాను. పాలకుర్తి నియోజకవర్గంలో అందరికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ లు ఇప్పించానన్న మంత్రి ఎర్రబెల్లి..పాలకుర్తిని ఆర్డీఓ డివిజన్ గా ఏర్పాటు చేస్తా.. పాలకుర్తికి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా అని చెప్పారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ను నమ్ముకుంటే కష్ట కాలం తప్ప ఒరిగేది ఏమి లేదు

 

Latest News

More Articles