సిద్దిపేటలో మంత్రి హరీష్రావు దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం114 లో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ఆ తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతోందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ఉత్సహకంగా పాల్గొంటున్నారని, గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్రం ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉంటుందో, బాగుంటుందో మేధావులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఓటు అనేది 5 ఏండ్ల భవిష్యత్ నిర్ణయించేదన్నారు. పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలన్నారు. నాగార్జున సాగర్ ఇష్యూ పై పోలింగ్ ముగిశాక మాట్లాడుతానని తెలిపారు మంత్రి హరీశ్ రావు.
ఇది కూడా చదవండి:నందినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్ దంపతులు