Saturday, May 4, 2024

బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారు

spot_img

ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును అవమానించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.. మరి తెలంగాణ సీఎం ను అవమానించిన బండి సంజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?.. ఆయనపై మేమేం చర్యలు తీసుకోవాలి అంటూ మంత్రి కేటీఆర్ మోడీ సర్కారును ప్రశ్నించారు. పార్లమెంట్ లో కేసీఆర్ ను అవమానిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా ఏం చర్యలు తీసుకోబోతున్నారని అన్నారు.

దొంగల అందరి ఇంటిపేరు మోడీ అనే ఎందుకు ఉంటుందంటూ రాహుల్ గాంధీ గతంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ నేతల ఫిర్యాదుతో రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు. హైకోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

Latest News

More Articles