Saturday, April 27, 2024

పిల్లలను అమరవీరులను చేసిందే కాంగ్రెస్. వాళ్లే ఇప్పుడు సంతాపం తెలుపుతున్నరు

spot_img

హైదరాబాద్: అప్పుడెట్లుందే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లా మారిందో చూడండి.. కండ్ల ముందు కనిపించేది నమ్మండి.. దిక్కుమాలిన సోషల్ మీడియా లో వచ్చేవి నమ్మవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. 65 ఎండ్లలో కాంగ్రెస్ చేయని పనులు చేసి ఇప్పుడు తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చుకున్నామని తెలిపారు. కానీ మార్పు రావాలిసింది జనాల జీవితంలో… పదేండ్ల క్రితం ఎకర పొలం ఎంత..? ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో గమనించాలని సూచించారు. తెలంగాణ భవనలో ట్రేడ్ యూనియన్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. నేటి కలియుగంలో జన్మించిన కలియుగ పురుషుడు సిఎం కేసీఆర్

నిరుద్యోగం కాంగ్రెస్ లో ఎక్కువైంది.. వాళ్లకు కావాల్సింది రాజకీయ ఉద్యోగం.. నిరుద్యోగుల మీద వీళ్లకు ఎందుకు ప్రేమ ఉంటుంది. కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇస్తం అని.. రాజస్థాన్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను తుంగలో తొక్కినారు. పిల్లలను అమరవీరులను చేసిందే కాంగ్రెస్. వాళ్లే ఇప్పుడు సంతాపం తెలుపుతున్నారని మండిపడ్డారు. అధికారం కోసం కాంగ్రెస్ ఆవురావురంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో 10 మంది కొత్త బట్టలు కుట్టిచ్చుకున్నారని సెటైర్లు చేశారు.

Also Read.. బండి సంజయ్ దుర్మార్గుడు, అత్యంత అవినీతిపరుడు

పెయింటర్ రేవంత్ రెడ్డి కి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బ్లాక్ మైలర్ చేతిలో రాష్ట్రం పెడుదామా? ఎన్నికలకు సప్లిమెంటరీ పరీక్షలు లాగా ఉండవు. ఒక్కసారి తప్పు చేస్తే సరిదిద్దుకోలేమన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలు తెలంగాణలో ఉండొద్దు అని అనుకుంటున్నామని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

Latest News

More Articles