Tuesday, May 7, 2024

మెగా ఫ్యామిలీపై తీవ్ర పదజాలం.. ఏపీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..!

spot_img

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యాకా కాస్త ఆచితూచి మాట్లాడుతున్నఫైర్ బ్రాండ్ రోజా తాజాగా మెగా బ్రదర్స్ పై విరుచుకుపడింది. దానధర్మాలు చేయని, సొంత ఊరు, సొంత మనుషులకి ఏమి చేయని ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారంటే అది మెగా ఫ్యామిలీ అంటూ విరుచుకుపడింది. అందుకే సొంత మనుషులు కూడా రాజకీయాల్లో మెగా బ్రదర్స్ ని ఓడిస్తున్నారని ఆరోపించింది. మెగా బ్రదర్స్ ని టార్గెట్ చేస్తూ.. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించింది ఎమ్మెల్యే రోజా. తాజాగా రోజా ఓ ఇంటర్వ్యూలో మెగా బ్రదర్స్ పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ అంత మానవత్వం లేనివాడు.. ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఒక ఆర్టిస్ట్ గా సిగ్గుపడుతున్నాను.. ఎందుకంటే జనరల్ గా ఆర్టిస్టులు అంటే చాలా సున్నితంగా ఉంటారు. ఎమోషనల్ గా ఉంటారు.

ఇక ఎంజీఆర్ జయలలిత ఎన్టీఆర్ లాంటి వారు అంత స్థాయిలో ఉన్నా అన్నీ వదలుకొని తమను ఇంతవారిని చేసిన ప్రజలకు సేవ చేయాలని.. ప్రజల్లో ఉంటూ.. ప్రజల భరోసాను పొంది సీఎంగా ఎన్నికయ్యారు..కానీ ఈ మెగా కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే? వీళ్లని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు కనీసం ఇప్పటివరకూ ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాల్లో సొంత నియోజకవర్గాల్లో ప్రజలు ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు’ అని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా బ్రదర్స్ ఎన్నికల్లో విజయం సాధించపోవడానికి గల కారణాలను రోజా విశ్లేషించారు.

Latest News

More Articles