హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రజా కవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కవి జయరాజ్కు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్తో కలిసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాళోజీ అవార్డును అందజేశారు.
Also Read.. బుల్లెట్ లాంటి ఎమ్మెల్యే రేగా.. గెలవకపోతే పినపాక నష్టపోతోంది..!!
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతి యేటా ఈ అవార్డును అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.