Tuesday, May 7, 2024

పొట్టోడా పిసుకుతే పోతావ్..!

spot_img

మంత్రి కేటీఆర్ బేగంపేట‌లోని ధ‌నియాల‌గుట్ట‌లో అధునాత‌న సౌక‌ర్యాల‌తో నిర్మించిన వైకుంఠధామాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తలసాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజన్ కారణంగా నగరంలో ఇలాంటి స్మశాన వాటికలో ఏర్పాటు జరుగుతుంది. హైదరాబాదులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.

ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు నిర్మాణం, పార్కులో నాళలు, అనేక డెవలప్మెంట్స్ కేసీఆర్ గారి ముందుచూపుతో జరుగుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు అభివృద్ధి కాకుండా ఇతర అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరికాదు. ఉన్నది ఇంతంత పిసుకుతే ప్రాణం పోతది. గతంలో మీరు చేసిన పాలన లోపం కారణంగానే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సమస్యలు ఉన్నాయి.

ఇక కులాలు, మతాల మధ్యలో చిచ్చుపెట్టి బీజేపీ పబ్బం గడపడం సరికాదు. తెలంగాణలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ కి ఉంది. 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాము. ఎన్నికలు వస్తున్నాయి కొత్త బిచ్చగాళ్లు వస్తారు మీరందరూ గ్రహించాలి; అని చెప్పారు మంత్రి తలసాని.

Latest News

More Articles