Tuesday, May 7, 2024

కంటోన్మెంట్ లో గులాబీపార్టీకి తిరుగులేదు

spot_img

సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు అన్నివర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇంఛార్జ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ లో గులాబీపార్టీ కి తిరుగులేదని స్పష్టం చేశారు. అన్నివర్గాల ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని వెల్లడించారు. సంక్షేమ సర్కారునే ప్రజలంతా కోరుకుంటున్నారని మంత్రి తలసాని అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 5వ వార్డులో మంత్రి తలసాని ప్రచారం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  లాస్యనందితతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని, లాస్యనందితకు గులాబీశ్రేణుల నుంచి అపూర్వ స్పందన లభించింది. మంగళహారతులు, డప్పు దరువులతో  ఘనస్వాగతం పలికారు. వందలాది మంది క్యాడర్ పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. జై కేసీఆర్ అంటూ లాస్యనందితకు సంపూర్ణ మద్దతు తెలిపారు. వాల్మీకి నగర్, గాంధీ గార్డెన్, దుర్గయ్య గార్డెన్, సంజీవయ్య నగర్, వీకర్ సెక్షన్,  సెకండ్ లక్ష్మీ నగర్ లో పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నాగేశ్, దేవేందర్  తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles