Saturday, May 4, 2024

స్టేషన్ ఘనపూర్ లో కడియం మార్క్

spot_img

ధర్మసాగర్ లో BRS పార్టీ గ్రామ స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి 300 మందికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కడియం. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘మరోసారి రాష్ట్రంలో బి.అర్.ఎస్ ప్రభుత్వం కచ్చితంగా వస్తుందని, కేసిఆర్ గారు రాష్ట్రన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో దేశంలోనే ముందు వరుసలో వుంచారని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తన మార్క్ చూపిస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు’ కడియం శ్రీహరి.

ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.పీ.టీ.సీ లు రోడ్ల రాజు యాదవ్ మరియు జాలిగపు వనమాల కడియం శ్రీహరి గారి సమక్షంలో బి.అర్.ఎస్ పార్టీలో చేరారు. అలాగే…వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మందికి పైగా బి.అర్.ఎస్ పార్టీలో చేరారు.

Latest News

More Articles