Friday, May 10, 2024

గాంధీభవన్ చేరిన నర్సాపూర్ సీట్ల పంచాయతీ.. పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలు

spot_img

హైదరాబాద్: గాంధీభవన్ ముందు నర్సాపూర్ కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. గాలి అనిల్ కుమార్ కు టికెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కోవర్ట్ కు హటావో  కాంగ్రెస్ కు బచావో అంటూ నినాదాలు చేశారు. నర్సాపూర్ టికెట్ ఆవుల రాజిరెడ్డికి కేటాయించింది కాంగ్రెస్.

Also Read.. ఓటు ఒక బ్రహ్మాస్త్రం.. ఆలోచించి ఓటు వేయాలి

నర్సాపూర్ అభ్యర్థిని మార్చి గాలి అనిల్ కుమార్ కు టికెట్ కేటాయించాలని అనుచరులు ఆందోళన చేపట్టారు. భారీ స్థాయిలో గాంధీ భవన్ కు చేరుకున్నారు గాలి అనిల్ వర్గీయులు. గాంధీ భవన్ వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసారు కార్యకర్తలు. నర్సాపూర్ అభ్యర్థిని మార్చాలంటూ నినాదాలు చేశారు.

Latest News

More Articles