Wednesday, May 8, 2024

అయ్యో ఎంత కష్టం.. పెన్షన్స్ కోసం వృద్ధుల ఆందోళన

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, వృద్దులు, మహిళలలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు దేవుడెరుగు.. కనీసం గత ప్రభుత్వ పథకాలని కూడా కొనసాగించటం లేదు. ఈ నేపథ్యంలో ఆసరా పెన్షన్లు రాక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల దాటినా పెన్షన్లు అందకపోవడంతో ఆందోళనకు దిగారు.

నారాయణ పేట మండలంలోని జాజాపూర్ గ్రామంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదంటూ రోడ్డు పై బైఠాయించారు. రోడ్డుకు అడ్డంగా కంచె వేసి నిరసన తెలిపారు. పెన్షన్లు అందకపోవడంతో తమ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాళ్లు మొక్కిన నేతలు ఇప్పుడు పత్తా లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

More Articles