ఎన్నికల నామినేషన్ ర్యాలీలో జనసేన అధినేత పవన్ కల్యాన్ డ్యాన్స్ ఇరగదీశారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనసేన అధినేత డ్యాన్స్ చేస్తూ జనసైనికులను ఉత్సాహా పరిచారు.
కాగా కాకినాడ లోకస్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైమ్ ఓనర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఆయన నామినేషన్ కార్యక్రమానికి పవన్ కూడా హాజరయ్యారు. ఈ డ్యాన్స్ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
కాకినాడ ఎంపి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి నామినేషన్ ర్యాలీలో జనసైనికుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన జనసేనాని#HelloAP_ByeByeYCP👋 #VoteForGlass #VoteForNDA ✊ pic.twitter.com/eSPcFPZDKn
— JanaSena Party (@JanaSenaParty) April 24, 2024
చేబ్రోలులోని తన నివాసం నుంచి ఉదయం కాకినాడ చేరుకున్న పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీగా కాకినాడ మెజిస్ట్రేట్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. పవన్ కల్యాణ్ రాకతో కాకినాడలో జనసైనికుల కోలాహలం అంబరాన్నంటింది.
ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో మహిళలు ఏ విటమిన్లు తీసుకోవాలి?