హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. 2023కు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఇందులో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ అగ్రస్థానంలో నిలిచింది. జైపూర్లో జరిగిన డీజీపీల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ బి.నాగేంద్రబాబు ట్రోఫీ అందుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబును డీజీపీ రవి గుప్తా అభినందించారు.
Also Read.. సీతక్క మాట్లాడుతుండగా కరెంట్ కట్.. నెటిజన్స్ కామెడీ
2023లో దేశంలో ఉన్న దాదాపు 17 వేలకు పైగా పోలీస్ స్టేషన్ల పనితీరు ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బహుమతులను ప్రకటించింది. మహిళలపై కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలను హోం మంత్రిత్వ శాఖ అధికారులు పరిశీలించి జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.