ప్రభాస్ సినిమా వచ్చిదంటే చాలు ఓ పండగలా ఎంజాయ్ చేస్తారు సినీ అభిమానులు. ఆయన హీరోగా, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరిరావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. జనవరి 19 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో సలార్ సినిమా స్ట్రీమింగ్కు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంతో ఎదురుచూస్తున్నారు.
Read also: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎస్ఎస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు
సలార్ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సలార్ సీక్వెల్ టైటిల్ను పార్ట్-1 చివర్లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశారు. మొదటి భాగాన్ని ‘సలార్-పార్ట్-1 సీజ్ఫైర్’ పేరుతో విడుదల చేయగా.. రెండో భాగానికి ‘సలార్-2 శౌర్యాంగపర్వం’ అనే పేరును ఖరారు చేశారు.