Sunday, May 5, 2024

మంత్రులు కూర్చున్నరు.. సర్పంచ్‎ను నిలబెట్టిండ్రు

spot_img

మనిషికి కాకపోయినా.. కనీసం ఆయన పదవికి అయినా విలువ ఇవ్వాలి. కానీ, ఓ మీటింగులో మాత్రం సర్పంచ్ కు కనీసం విలువు ఇవ్వకుండా బంట్రోతులా నిలబెట్టారు. మరి ఆ మీటింగులో ఉన్నది సాదాసీదా ప్రజాప్రతినిధులు కాదు సుమా. అక్కడ ఉన్నది అక్షరాల మంత్రులు కావడం గమనార్హం. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం జరిగింది.

Read Also: డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. సీటులోనే మృతి

మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రులు శుక్రవారం వెళ్లారు. అక్కడ పర్యటన ముగిసిన అనంతరం లక్ష్మీబరాజ్‌లో పిల్లర్ల కుంగుబాటుపై మంత్రులు, అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు మంత్రులు, అధికారులు కుర్చీల్లో కూర్చోగా ఆ గ్రామ సర్పంచ్‌ ఎర్రవెల్లి విలాస్‌రావు మాత్రం వెనుకవైపు నిల్చొని కనిపించారు. దాంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మీరు ఎంత మంత్రులు అయినా సరే.. కానీ, ఆయన మాత్రం ఆ ఊరికి సర్పంచే కదా అని అంటున్నారు. ఆ ఊరి ప్రజలకు ఆయనే కదా ప్రజాప్రతినిధి, మరి ఆయన గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Latest News

More Articles