Wednesday, May 8, 2024

 జమ్మూ కశ్మీర్‌ రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు మృతి

spot_img

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. కిష్త్వార్‌ లో ఇవాళ(బుధవారం) ఉదయం కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో..ఆరుగురు చనిపోగా చెంద‌గా, ప‌లువురు గాయపడ్డారు.

డంగుదురు పవర్‌ ప్రాజెక్ట్‌ కు చెందిన 10 మంది కార్మికులు క్రూజర్‌ వాహనంలో వెళ్తున్నారు. డంగుదురు డ్యామ్‌ సైట్‌  సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి కిష్త్వార్‌లో లోతైన లోయలోకి బోల్తాపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Latest News

More Articles