బీహార్ రాజధాని పట్నాలోని ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పట్నా రైల్వేస్టేషన్ సమీపంలోని హోటల్లో ఇవాళ( గురువారం) ఈ ప్రమాదం జరిగింది.
ఉదయం 11 గంటల సమయంలో హోటల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడమే అందుకు కారణమని తెలుస్తోంది. దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మంటల్లో చిక్కుకుపోయిన కొందరిని రక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు