సెల్ ఫొన్ల వాడకం ఊహించనంతగా పెరిగిపోయింది. అసలు క్షణం కూడా తీరిక లేకుండా మొబైల్స్ యూజ్ చూస్తున్నారు. డ్రైవింగ్ చేసేప్పుడు…రోడ్డు దాటేప్పుడు కూడా సెల్ యూజ్ చూస్తున్నారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ రైలు ఎక్కినా, దిగినా జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తామని రైల్వే అధికారులు హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇవాళ(బుధవారం) ఓ ప్రకటన చేసింది. రైల్వే ట్రాక్స్ పై సెల్ఫీలు తీసుకున్నా జైలు శిక్ష తప్పదన్నారు అధికారులు. పట్టాల వెంబడి రీల్స్, షార్ట్ ఫిల్మ్ లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫొటోగ్రఫీలు తీసుకుంటే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు.
రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం కూడా నేరమేనని తెలిపారు. ప్రయాణీకులు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, సబ్వేలు, రోడ్ ఓవర్ బ్రిడ్జీలను ఉపయోగించాలన్నారు. నిబంధనలు ఉల్లఘించినట్లయితే భారతీయ రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 147 ప్రకారం 6నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.వెయ్యి వరకు జరిమానా. లేదా రెండు శిక్షలు విధిస్తామని హెచ్చరిచారు రైల్వే అధికారులు.
ఇది కూడా చదవండి: పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10వేలు నష్టపరిహారం ఇవ్వండి