Sunday, May 5, 2024

భార్య డబ్బులు వాడుకునే హక్కు భర్తకు లేదు..సుప్రీంకోర్టు.!

spot_img

భార్య డబ్బులు, ఆస్తిపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒకవేళ కష్టసమ యంలో వాడుకున్నా..ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ మహిళ నష్టోయిన బంగారానికి బదులుగా ఆమెకు రూ. 25లక్షలు చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది. వివాహం సందర్భంగా తన పట్టింట్టి వారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని..పెళ్లి తర్వాత కూడా తన తండ్రి తన భర్తకు రూ. 2లక్షల చెక్ ఇచ్చారని..ఈ కేసులో ఓ మహిళ పేర్కొన్నారు.

తొలిరాత్రి రోజు ఆ ఆభరణాలను తన భర్త స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి ఇచ్చాడని..ఆపై వారిద్దరూ తమకు అంతకు ముందే ఉన్న అప్పులు తీర్చడానికి వాటిని దుర్వినియోగం చేశారంటూ ఆమె ఆరోపించారు. దీనిపై తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఓ కుటుంబ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం..స్త్రీ ధనం భార్యభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె ఆభరణాలు దుర్వినియోగానికి గాను ఆమెకు రూ. 25లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

ఇది కూడా చదవండి :  మహిళలకు శుభవార్త..భారీగా తగ్గుతున్న బంగారం ధర.!

Latest News

More Articles