సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామర్లపల్లి లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను సోహెల్ (17),కైసార్ (30), ముస్తఫా (3) గా గుర్తించారు. హైదరాబాద్ కి చెందిన వీరు దుద్దెడకు ఫంక్షన్ వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో బంధువులను కలిసి వెళ్లేందుకు మాసంపల్లికి వచ్చారు. ఊరు పక్కన ఉన్న చెరువు వద్ద ఫోటోలు దిగుతుండగా.. బాలుడు ముస్తఫా నీటిలోకి జారి పడటంతో అతని రక్షించే క్రమంలో సోహెల్, కైసార్ కూడా నీట మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.