Monday, May 6, 2024

బతుకమ్మ పండుగ నాడే విషాదం.. ముగ్గురు కార్మికులు మృతి

spot_img

సిద్దిపేట: బతుకమ్మ పండుగలో భాగంగా ఊరి చెరువులో వ్యర్థ పదార్థాలు, చెత్తను తొలగించేందుకు నీటిలో దిగి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటు చేసుకుంది.

Also Read.. అసెంబ్లీ ఎన్నికలు.. తనిఖీల్లో రూ.74 కోట్లు సీజ్

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తీగుల్ గ్రామంలో ముగ్గురు కార్మికులు చెరువులో దిగారు. అనంతరం వారు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు గాలింపు చేపట్టి ముగ్గరి మృతదేహాలను వెలికితీశారు. మృతులను బాబు, భారతి, యాదమ్మగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Latest News

More Articles