Monday, May 6, 2024

కలెక్టర్ గా సేవ చేశా… ఎంపీగా మరింత సేవ చేస్తా

spot_img

కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చిందని, బాండ్ పేపర్ ను చెల్లని కాగితంగా ఆ పార్టీ చేసిందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి విమర్శించారు. రైతులను దుఃఖ సాగరంలో నింపింది కాంగ్రెస్ అని, ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయాలన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామ రెడ్డి ఇవాళ(బుధవారం) నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కలెక్టరేట్ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడారు. ఈ రోజు రెండు సెట్లు నామినేషన్ వేశామని, రేపు(గురువారం) మరో రెండు సెట్లు వేయబోతున్నామని, గురువారం హరీష్ రావు, ఎమ్మెల్యేలు, అశేష అభిమానుల మధ్య రేపు దాఖలు చేయబోతున్నామని వివరించారు.

బీజేపీ అభ్యర్థి రఘునందన్ ప్రజలను మోసం చేశారని, ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, నాగలి, ఎడ్లు, నిరుద్యోగ భృతి అని మోసం చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారని వెంకట్రామారెడ్డి విమర్శించారు. దుబ్బాకలో 54 వేల ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యారని, దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ పార్లమెంట్ నియోజవర్గాల్లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ప్రజలకు అధికారిగా ఉన్నానని, మరింత సేవ చేసేలా ఎంపీగా మీ ముందుకు వస్తున్నానని, ముగ్గురు అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటు వేయాలని వెంకట్రామారెడ్డి కోరారు. కలెక్టర్ గా ఇక్కడే పని చేశానని, ఎంపీగా పోటీ చేస్తున్నానని, తన అదృష్టంగా భావిస్తున్నానని, కలెక్టర్ ఎంపీగా మీ ముందుకు వస్తున్నారని ఆశీర్వాదించాలని కోరారు. జీవితాంతం మీ సేవలో ఉంటానని, ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తున్నానని, ఫంక్షన్ హాల్స్  నిర్మించి ఉచితంగా సదుపాయం కలిపించానని వివరించారు.

ఇది కూడా చదవండి: పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం

Latest News

More Articles