Tuesday, May 7, 2024

మామను చేతి కర్రతో చితకబాదిన కోడలు.. వీడియో వైరల్.!

spot_img

మామను తండ్రిలా చూసుకోవల్సిన కోడలు మృగంలా మారింది. వృద్ధుడైన తన మామను చేతికర్రతో తీవ్రంగా కొట్టింది. ఈ ఘటనలో కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటకలోని మంగళూరులో మార్చి 9వ తేదీని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకాం…మంగళూరుకు చెందిన పద్మనాభ సువర్ణ అనే వృద్ధుడు కుల్ శేఖర్ఏరియాలో నివాసిస్తున్నాడు. అయితే పద్మనాభ కోడలు ఉమా శంకరి మార్చి 9వ తేదీని అతనిపై దాడికి పాల్పడింది. చేతి కర్రతో ఇష్టం వచ్చినట్లుగా మామను చితకబాదింది. దీనికి సంబంధించిన ద్రుశ్యాలన్నీ కూడా అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

అనుమానంతో సీసీటీవీని పరిశీలించిన వృద్ధుడి కుమార్తెకు తన తండ్రిని కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గాయాలపాలైన పద్మనాభ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉమా శంకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అట్టవార్ లోని ఎలక్ట్రిసిటి ప్రొవైడర్ కంపెనీలో ఉమా ఉద్యోగం చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఉమాపై కఠిన చర్యలు తీసుకోవాలని వృద్ధుడి కుమార్తె డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి: నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు..పాటించాల్సిన నియమాలేంటి?

 

Latest News

More Articles