న్యూఢిల్లీ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల బాక్సింగ్ విభాగంలో మహిళల 75 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్లో అడుపెట్టింది. ఆసియా క్రీడల్లో ఫైనల్కు చేరడం ద్వారా ఆమె 2024లో జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను కూడా ఖాయం చేసుకున్నట్లయ్యింది.
Also Read.. మళ్ళా కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలే.. హెచ్చరించిన హరీష్ రావు
ప్రపంచ చాంపియన్ అయిన లవ్లీనా మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో థాయ్లాండ్ బాక్సర్ బాయ్సన్ మనీకోన్పై విజయం సాధించింది. బుధవారం ఫైనల్ జరుగనుంది. ఇక 19 ఏళ్ల ప్రీతి పవార్ కూడా ఇవాళ జరిగిన 54 కేజీల బాక్సింగ్ సెమీస్లో ఓడి కాంస్యం అందుకుంది. సెమీస్కు చేరడం ద్వారా పారిస్ ఒలింపిక్స్ ఆమె కూడా బెర్త్ను ఖాయం చేసుకుంది.