Saturday, May 4, 2024

పేకాటరాయుళ్లతో పుట్టిన రోజు వేడుకలు..డీఐ మహేందర్ రెడ్డి సస్పెన్షన్.!

spot_img

మంగళ్ హాట్ ఠాణా డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. కొందరు జూదరులు,గంజాయి వ్యాపారులతో కలిసి జూద ఇళ్లలోనే డీఐ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేథ్యంలో ఆయనపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా కూడా సీపీ ద్రుష్టికి వెళ్లడంతో బుధవారం కార్యాలయానికి పిలిపించి ఉత్తర్వుల కాపీని చేతిలో పెట్టారని విశ్వసనీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.

శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన గురుతల బాధ్యతను డీఐ విస్మరించి..తనపుట్టిన రోజు వేడుకలను జూదం నిర్వహిస్తున్నస్థావరంలోనే జరుపుకోన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఇన్ స్పెక్టర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు అర్థరాత్రి పూజ జూద ఇళ్లలకు వెళ్లినట్లు…అక్కడే కేక్ కోసం జూదరులతో సంబురాలు చేసుకున్నట్లు తేలింది. ఠాణా పరిధిలోని గంజాయి విక్రేతలు, జూదం నిర్వహిస్తున్న వ్యక్తులు, రౌడీషీటర్లతో చనువుగా మెలుగుతూ అంతా తానై వ్యవహరిస్తున్నట్లు ప్రస్తుతం గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో మహిళలు ఏ విటమిన్లు తీసుకోవాలి?

Latest News

More Articles