Wednesday, May 8, 2024

జడ్చర్లలో బీఆర్ఎస్ అధినేతకు ఘనస్వాగతం..హారతిపట్టి స్వాగతించిన మహిళలు.!

spot_img

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జడ్చర్ల ప్రజలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతులు పట్టి తమ ప్రియతమ నాయకుడిని స్వాగతించారు. లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24 నుంచి కేసీఆర్ 17రోజుల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నేడు ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు.

జడ్చర్లకు చేరుకున్న కేసీఆర్ కు అప్పనపల్లి, ఏనుగొండ మీదుగా గడియారంకూడలికి చేరుకున్నారు. గడియారం కూడలిలో కార్నర్ మీటింగులో ప్రసంగించారు. కేసీఆర్ 17రోజులుపాటు రాష్ట్రంలో పర్యటించి 12 లోకసభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, పలు వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు గులాబీ బాస్.


ఇది కూడా చదవండి: లాభాల్లో టాప్ గేర్‎లో మారుతీ..చరిత్రలో అతిపెద్ద డివిడెండ్ .! 

Latest News

More Articles