Wednesday, May 8, 2024

కాంగ్రెస్ మాట తప్పింది.. కడియం శ్రీహరి నిప్పులు

spot_img

హైదరాబాద్: ప్రజలకు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ చెప్పారని,వారి మేనిఫెస్టో లో కూడా ప్రకటించారని తెలిపారు. కానీ, బుధవారం ఫైనాన్స్ మినిష్టర్ నిరుద్యోగ భృతి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని అంటున్నారని చెప్పారు.

Also Read.. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పంటలకు క్రాప్ హాలిడే!

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పంట రుణాలు 2 లక్షలు తీసుకొంది ఆ పంట రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. రైతు పండించే ప్రతి పంటకు బోనస్ ఇస్తామని అన్నారు. డిసెంబర్ 9 పోయి 21వ తేదీ వచ్చింది. ఈ మూడు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Also Read.. 800 కోట్లున్నా..క్రౌడ్‌ ఫండింగ్‌కు కాంగ్రెస్.. బ్లాక్ మనీని వైట్ చేసేందుకేనా?

కాంగ్రెస్ మాట తప్పింది. ఇచ్చిన హామీని మేము ఇవ్వలేదు అంటున్నారు. దీనిని బిఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆరు గ్యారంటీ లను తూచా తప్పకుండా చేయాలి. నిరుద్యోగ భృతి, పంటకు బోనస్, రుణమాఫీ వెంటనే చేయాలి. అధికారమే లక్ష్యంగా అమలు కానీ హామీని ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీపై ఆయన మండిపడ్డారు.

Latest News

More Articles