Friday, May 10, 2024

బీఆర్ఎస్ జోష్.. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం కేసీఆర్

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రేపు(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరావు విజయాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించనున్నారు.

Also Read.. గెలుపు కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్నారు

అలాగే పినపాక బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు విజయాన్ని కాంక్షిస్తూ బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లడతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకేరోజు రెండు సభలతో ప్రచార హోరు పెంచనుంది బీఆర్ఎస్.  ఒక్కొక్క సభకు 50 వేలకు పైచిలుకు జనం తరలివస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ సభల కోసం బీఆర్ఎస్ జిల్లా పార్టీ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది.

Latest News

More Articles