హైదరాబాద్: మెట్రో రైల్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రయాణించారు. ఎల్బీనగర్ నుంచీ లకిడికాపూల్ వరకు ప్రయాణం సాగింది. మెట్రో లో ప్రయాణించిన హరీష్ ప్రయాణికులతో ముచ్చటించారు. నాగోల్ శిల్పారామం కార్యక్రమంలో పాల్గొని దాదాపు అదే సమయంలో రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమానికి రావడానికి ఆలస్యం అవుతుండటంతో మెట్రో లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రయాణించారు.
రవీంద్ర భారతి లో ఆట(అమెరికన్ తెలుగు అసోసియేషన్) కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,నటుడు రాజేంద్ర ప్రసాద్ తోపాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.