Tuesday, May 7, 2024

ఖమ్మంలో గ్రూప్ వార్.. అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దాడి

spot_img

ఖమ్మంలో శనివారం అర్థరాత్రి గ్రూప్ వార్ జరిగింది. మద్యం మత్తులో ఒక గ్రూప్ మరో గ్రూప్ మీద దాడి చేసింది. ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డులో రమేష్ దాబాలో ఈ ఘటన జరిగింది. తెల్డారు పల్లి యువకులను ఖమ్మం రేవతీ సెంటర్ యువకులు చిత్తక్కొట్టారు. ఈ దాడిలో నలుగురు యువకుల తలలు పగిలాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చేయిస్తుండగా.. మరోసారి ఖమ్మం పట్టణ రేవతి సెంటర్ యువకులు రెచ్చిపోయారు. 50మందికి పైగా యువకులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని తెల్దారుపల్లి యువకులను, గ్రామస్తులను పరుగెత్తించి కర్రలతో కొట్టారు. ఈ దాడిని అడ్డుకోబోయిన ఖమ్మం రూరల్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ పై కూడా దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఘటనస్థలికి చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది యువకులను గుర్తించి అదుపులోకి తీసుకోగా.. మిగతావారి కోసం గాలింపు చేపట్టారు. రేవతి సెంటర్ పరిసర ప్రాంతాల్లో వారికోసం గాలిస్తున్నారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్.. ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని ఆరా తీశారు.

Latest News

More Articles