Tuesday, May 7, 2024

మిషన్ పార్లమెంట్.. అట్టహాసంగా బీఆర్ఎస్ సమావేశం

spot_img

యాదాద్రిలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం అట్టహాసంగా జరిగింది. యాదాద్రి జిల్లా పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం భువనగిరిలో జరుగగా.. ఈ మీటింగ్ కి మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు.

ఇక వీరితో పాటు ZP చైర్మన్ సందీప్ రెడ్డి, భువనగిరి, మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ జడల అమరెందర్ గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు కొలుపుల అమరెందర్, BRS నేతలు జిట్టా బాలకృష్ణ రెడ్డి, చింతల వెంకటేశ్వర రెడ్డి, స్థానిక, నాయకులు పాల్గొన్నారు.

Latest News

More Articles