Wednesday, May 8, 2024

కాంగ్రెస్, బీజేపీ లను నమ్మి మోసపోవద్దు

spot_img

జనగామలో మంచి మెజారిటీతో బీఆర్ఎస్  పార్టీని గెలిపించుకుంటాంమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా కావడమే కాదు అద్భుతంగా అభివృద్ధి జరిగిందన్నారు. జనగామ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బస్వరాజు సారయ్య. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి..అనేక ఉద్యమాలు చేసిన జిల్లా జనగామ.నీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. నీళ్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది.ఇక్కడి నుండి గతంలో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఒక్క చెక్ పోస్ట్ కట్టారా అని ప్రశ్నించారు.జనగామ ప్రాంతానికి నీళ్లు తెచ్చింది సీఎం కేసీఆర్ కాదా? అని అన్నారు.

దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి హరీష్ రావు పాత్ర కీలకమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ నాయకత్వంలో మనం పని చేయాలన్నారు. ఇద్దరు సత్తా ఉన్న నాయకులు రాజయ్య, ముత్తిరెడ్డికి కేబినెట్ ర్యాంక్ పోస్ట్ లు ఇచ్చారని తెలిపారు. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 60 ఏళ్లు తెలంగాణను నాశనం చేశారు.. ఏం తక్కువయిందో కాంగ్రెస్, బీజేపీ చెప్పాలన్నారు మంత్రి ఎర్రబెల్లి. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దన్నారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలంటే నడి రోడ్డు మీద నిలదీయాలన్నారు. తెలంగాణలో రూ. 4వేలు పెన్షన్ ఇస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఛాలెంజ్ గా తీసుకుని పని చేయాలి.. కాంగ్రెస్ వాళ్లు నామినేషన్ వేయాలంటే భయపడాలన్నారు. 16వ తేదీన జనగామలో జరిగే సీఎం సభ దద్దరిల్లాలని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఇది కూడా చదవండి: ఎన్నికల్లో నాకు సరైన పోటీ లేకుంటే మజా ఉండదు

Latest News

More Articles