Thursday, May 9, 2024

నమో పాలమూరు ప్రసంగంపై కేటీఆర్ ఫైర్

spot_img

హైదరాబాద్: నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీపై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉందని, కానీ బిజెపి స్టీరింగ్.. అదాని చేతిలోకి వెళ్లిపోయిందని సెటైర్లు వేశారు.

Also Read.. వలస వేళ్లినోళ్లు తిరిగి గ్రామాలకే వలస వస్తున్నారు.. తెలంగాణ అంటే అది

మోడీ కిసాన్ సమాన్ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం. కానీ ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం ప్రధాని తెలుసుకుంటే మంచిది. రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం… మిలియన్ డాలర్ జోక్. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు  రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక  సందర్భం  తెలంగాణలోనే ఆవిష్కృతమైందన్నారు.

Also Read.. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటే.. పెళ్లి, ఇల్లు రెండు కేసీఆరే చేయిస్తుండు

అన్నదాత అప్పులు మాఫీ చేసి జైకిసాన్  ప్రభుత్వం మాది. కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన ..నై కిసాన్ సర్కారు మోడీది. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతుహంతక రాజ్యం మీది. పదేళ్లపాటు విభజన హామీలను పాతరేసి.. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి.. ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదేవరు. ప్రాజెక్టులు వల్ల చుక్క నీరు రాలేదనడం.. ప్రధాని అవివేకానికి నిదర్శనమన్నారు.

Also Read.. చందర్ గెలవగానే రామగుండంని దత్తత తీసుకుంటా.. కేటీఆర్ హామీ

తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం. తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మోడినా మాట్లాడేది. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న మీ కేంద్ర పెద్దల అవమానకర మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదు. బీజేపీ ఎన్ని చెప్పినా.. బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని అని పేర్కొన్నారు.

Also Read.. షర్మిల, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డిలపై విరుచుకుపడ్డ మంత్రి గంగుల

నిన్న కాళేశ్వరం అయినా..నేడు పాలమూరు  ప్రాజెక్టు  అయినా..ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు.భవిష్యత్తు ఇరిగేషన్ రంగానికే సరికొత్త పాఠాలు.  వీటిపై మోడీ పాలమూరు పర్యటనలో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

Latest News

More Articles