హైదరాబాద్: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నామని, సాగునీటి రాకతో రాష్ట్రంలో వరిసాగు పెద్ద ఎత్తున పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నా వానాకాలంలో ఇప్పటి వరకు 57.51 లక్షల ఎకరాలలో వరి, 44.73 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారని తెలిపారు.
Hyderabad 18న గణేష్ పండుగ.. సెప్టెంబర్ 28న నిమజ్జనం.. ఏర్పాట్లపై కీలక సమీక్ష
‘వరితో పాటు ఇప్పటి వరకు 5.28 లక్షల ఎకరాలలో మొక్కజొన్న, 4.61 లక్షల ఎకరాలలో కందులు సాగు చేశారు. మొత్తం రాష్ట్రంలో 1.18 కోట్ల ఎకరాలలో వివిధ రకాల వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలవనరులు పెరగడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు మూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద భరోసాతో రైతులు పంటలు సాగుచేస్తున్నారని పేర్కొన్నారు.
సెప్టెంబరు 1న 14,747 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదయింది. గత ఏడాది ఇదే రోజు 11,198 మెగావాట్ల విద్యుత్ నమోదవడం గమనార్హం.. అయినా రైతాంగానికి కరంటు విషయంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చూస్తున్నది. వరుణుడు కరుణించడంతో నిన్న రాష్ట్రంలో 8891 మెగావాట్ల విద్యుత్ డిమాండ్, ఈ రోజు 7414 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయిందని తెలిపారు.
T20 ఇంగ్లండ్పై శ్రీలంక చారిత్రాత్మక విజయం..!!
ఈ ఏడాది కృష్ణా బేసిన్ లో వర్షాలు లేకున్నా డిమాండ్ కు సరిపడా కరంటు సరఫరా చేశారు. రాష్ట్రంలో మొత్తం కరంటు వినియోగంలో వ్యవసాయ రంగం 35 నుండి 40 శాతం వాటా నమోదవుతున్నది. దేశంలో అత్యధిక శాతం వ్యవసాయ రంగానికి కరంటు వినియోగించుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రైతాంగానికి అంతరాయం లేకుండా కరంటు అందజేస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.