హైదరాబాద్: మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్.. తాజాగా త్రివిక్రమ్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. దర్శకుడు సంపత్నందితో కలిసి ఓ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చింది. సితారా, శ్రీకర స్డూడియోస్తో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తుంది.
Also Read.. ‘విక్రమార్కుడు-2’పై రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు
‘SDT17 ‘అంటూ ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎడమ చెవి కింద త్రిషూలం టాటూతో ఉన్న ప్రీ లుక్ పోస్టర్ మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ను ఆదివారం ఉదయం 8.55 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు గంజాయి శంకర్ అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. సాయిధరమ్ తేజ్కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
A Thundering First High from our #SDT17 will be unveiled TOMORROW at 8:55 AM! 💥
A @IamSampathNandi MASSS MISSILE🔥 @IamSaiDharamTej @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/z4r8ymkG56
— Sithara Entertainments (@SitharaEnts) October 14, 2023