Saturday, May 4, 2024

ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించి.. సెమీస్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా

spot_img

భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంపకప్ 2023లో నాకౌట్‌ బెర్తును ఖరారు చేసుకుంది టీమిండియా. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను టీమిండియా 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచులలో టీమిండియా గెల్వడం విశేషం.

Also Read.. బాతు గుడ్లు పెట్టిన రూట్.. దెబ్బకు దెబ్బ కొట్టిన టీమిండియా ఫ్యాన్స్

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్యఛేదన దిగిన ఇంగ్లాండ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. లివింగ్‌స్టోన్ (27) టాప్‌ స్కోరర్ కావడం గమనార్హం. జానీ బెయిర్‌స్టో (14), డేవిడ్ మలన్ (16) పరుగులు చేయగా.. జో రూట్ (0), బెన్‌స్టోక్స్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరారు. బట్లర్ (10), మొయిన్ అలీ (15), క్రిస్‌వోక్స్ (10) కొద్దిసేపు పోరాడారు. భారత బౌలర్లలో షమి (4/22), బుమ్రా (3/32), కుల్‌దీప్ యాదవ్‌ (2/24), జడేజా ఒక వికెట్‌ పడగొట్టారు.

Latest News

More Articles