Sunday, May 5, 2024

టీజీఓ అధ్యక్షురాలు మమత బదిలీ

spot_img

హైదరాబాద్:  తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది. మమతను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె స్థానంలో ఐఏఎస్‌ అధికారి అభిలాష అభినవ్‌ ను నియమించారు.  జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి డెప్యూటేషన్‌ను రద్దు చేసి.. చేనేత, జౌళిశాఖ అదనపు డైరెక్టర్‌గా పాతచోటుకే చోటుకే బదిలీ చేసింది.

Also Read.. 16 వేల అడుగుల ఎత్తులో డోరు ఓపెన్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

శేరిలింగంపల్లి కొత్త జోనల్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ స్నేహ శబరీష్‌ ను నియమించారు. జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వెంకట రమణను మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్‌ఈగా బదిలీ చేసింది.  ప్రస్తుతం ఉన్న మూసీ అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ మల్లికార్జునుడును ఈఎన్‌సీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దాన కిశోర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Latest News

More Articles