సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కాశింపూర్లో విషాదం జరిగింద. భర్త మరణం తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కాశింపూర్ గ్రామానికి చెందిన మహాదేవి(35) భర్త శేఖర్ 3 నెలల క్రితం మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక నిన్న(శనివారం) అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన భార్య మహాదేవి గ్రామ సమీపంలోని వ్యవయసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న చిరాగ్పల్లి పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి.. జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం