మేడ్చల్: కుత్బుల్లాపూర్ లోని గాజులరామారం చిత్తారమ్మటెంపుల్ జాతరలో అపశృతి చోటుచేసుకున్నది. జాతరకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం చిత్తారమ్మ తల్లి జాతరలో శిగం ఊగుతున్న రాము(50) అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. స్థానికులు సీపీఆర్ చేసి, స్థానికంగా ఉన్న ఉషాముల్లపూడి హస్పిటల్ కి తరలించారు. కానీ, అప్పటికే అతను చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు.
Also Read.. తమిళనాడులో నిర్మలమ్మకు షాక్.. అయోధ్య లైవ్ LED స్క్రీన్ లు తొలగింపు