పాకిస్థాన్ లో లష్కర్ ఏ జబ్బార్ వ్యవస్థాపకుడు దావూద్ మాలిక్ హత్యకు గురయ్యాడు. ఇయన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్కు అత్యంత సన్నిహితుడు. పాకిస్థాన్లోని ఉత్తర వజీరిస్థాన్ దావూద్ మాలిక్పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారని పాక్ పోలీసులు తెలిపారు. ముసుగులు ధరించిన వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి పారిపోయారని పేర్కొన్నారు.
Also Read.. ఇద్దరు అమెరికన్లను విడిచిపెట్టిన హమాస్
ఇటీవల పఠాన్కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్తో పాటు ఐఎస్ఐ ఏజెంట్ ముల్లా బహూర్ అలియాస్ హోర్ముజ్లు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మరణించారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించిన పలువురు ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ రక్షణ కల్పిస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి.