హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గ్రేటర్ పరిధిలో రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీలో సీనియర్లకు న్యాయం జరగలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read.. రూ. 50 వేలు మించి నగదు ఉంటే సీజ్ చేస్తాం
ఇప్పటికే మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నందికంటి శ్రీధర్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. పొన్నాల జనగామ టికెట్ ఆశించారు. అలాగే సోమశేఖర్ రెడ్డి ఉప్పల్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎమ్మెల్యే టికెట్లు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.