డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్కు హైకోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతను వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాకుండా.. నవదీప్కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని పోలీసులకు సూచించింది. అయితే ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేయొద్దని తెలిపింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని నవదీప్ను కూడా ఆదేశించింది. అయితే నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో నవదీప్ తో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులకు కూడా నోటీసులిచ్చేందుకు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సిద్ధమవుతున్నారు.
Read Also: నేటి నుంచి గణేష్ నిమజ్జనాలు.. జీహెచ్ఎంసీలో 74 ప్రత్యేక కొలనులు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనను అన్యాయంగా ఇరికించారంటూ నవదీప్ సెప్టెంబర్ 15న హైకోర్టులో పిటిషన్ వేశాడు. దాంతో సెప్టెంబర్ 19వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజు మరోసారి విచారణ జరిపిన కోర్టు.. పోలీసులు సమర్పించిన నివేదిక ఆధారంగా నవదీప్ కు నోటీసులిచ్చి, విచారణ చేయాలని ఆదేశించింది.
Read Also: కాంగ్రెస్కు పొరపాటున ఓటేస్తే ఆ ఆరు కష్టాలు గ్యారెంటీ